MI vs LSG : నీకు దండం పెడతా… ఆడియో బంద్ చెయ్

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 18, 2024 | 03:18 PMLast Updated on: May 18, 2024 | 3:18 PM

I Will Give You A Stick Audio Will Be Stopped

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ముంబై రంజీ టీమ్ సీనియర్ ఆటగాళ్లతో రోహిత్ శర్మ సరదాగా మాట్లాడాడు. ఈ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్ కెమెరాలు రోహిత్‌ను చూపించే ప్రయత్నం చేయగా.. అతను ఫన్నీగా స్పందించాడు.

ఇప్పటికే కోల్‌కతా కోచ్ అభిషేక్ నాయర్‌తో సంభాషణ వైరల్‌గా మారిన సంగతి గుర్తుకొచ్చి.. సదరు కెమెరామన్‌కు రోహిత్ సరదాగా ఓ విజ్ఞప్తి చేశాడు. బ్రదర్‌ ప్లీజ్‌ ఆడియోను ఆఫ్ చేయి. ఇప్పటికే ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. గత వారం ముంబై ఇండియన్స్ టీమ్‌ పేరును ప్రస్తావించకుండా ఆ జట్టును ఉద్దేశించి రోహిత్ శర్మ చేసిన సంచలనంగా మారాయి. మళ్ళీ అటువంటి ఇబ్బంది రాకుండా ఆడియో ఆఫ్ చేయాలని రోహిత్ కోరిన విషయం ఇపుడు వైరల్ గా మారింది.