Team India: చెన్నై స్టేడియం అంటేనే గుబులు.. చరిత్రను తిరగరాసేస్తాం

ఐసీసీ టోర్నీల్లో సాధారణంగా నాకౌట్ దశలో తలపడే రెండు జట్లు ఈసారి తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగడం. అంటే భారత్-ఆస్ట్రేలియాలు చెపాక్ మైదానంలో 4 సార్లు తలపడ్డాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 29, 2023 | 04:50 PMLast Updated on: Jun 29, 2023 | 4:50 PM

India To Play Australia In Its Opener In Chennai It Is Very Important For India

Team India: వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో భారత జట్టు అక్టోబర్ 8న తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇక్కడ టీమిండియాకు తొలి ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడం విశేషం. ఐసీసీ టోర్నీల్లో సాధారణంగా నాకౌట్ దశలో తలపడే రెండు జట్లు ఈసారి తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి.

విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగడం. అంటే భారత్-ఆస్ట్రేలియాలు చెపాక్ మైదానంలో 4 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. ఆస్ట్రేలియా రెండు సార్లు గెలిచింది. అంటే చెపాక్ స్టేడియంలో రెండు జట్లూ సమానంగా నిలిచాయి. వన్డే క్రికెట్‌లో ఇరు జట్లు మొత్తం 146 సార్లు తలపడ్డాయి. భారత జట్టు 54 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆస్ట్రేలియా జట్టు 82 సార్లు విజయం సాధించింది. మరో 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. అంటే చెపాక్ స్టేడియంలో భారత జట్టుపై ఆస్ట్రేలియా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది.

అంతే కాకుండా వన్డే క్రికెట్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. అలాగే ఈ ఏడాది భారత్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో చెన్నై చెపాక్ స్టేడియంలో ఒక మ్యాచ్ గెలిచిన విషయం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. ఇన్ని కారణాల వల్ల తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు నుంచి టీమిండియాకు గట్టి సవాల్‌ ఎదురవుతుందనడంలో సందేహం లేదు.