Rohith Sharma: నువ్వు ఒక్కడివే ఆడట్లేదు నువ్వు జూలు విదిలిస్తే కథ వేరే ఉంటది..

ఈ ఏడాది భారత్​లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. మునుపటి కంటే ఈసారి థ్రిల్లింగ్ మ్యాచ్​లు ఎక్కువ ఉంటాయన్నాడు. అథ్లెటిక్స్​లో ఒలింపిక్స్​ ఎలాగో.. క్రికెట్​లో వరల్డ్ కప్ అలాంటిది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 28, 2023 | 05:07 PMLast Updated on: Jun 28, 2023 | 5:07 PM

Indian Cricket Team Captain Rohit Sharma Said That It Is Difficult To Win The Odi World Cup And Now The Style Of Cricket Has Changed

అందుకే క్రికెట్ ఆడే ప్రతి దేశం ఈ మెగా కప్​ను గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతుంది. బెస్ట్ టీమ్స్​ తలపడే ఈ టోర్నీలో నెగ్గడం అంత ఈజీ కాదు. జట్లు బలంగా ఉండటంతో పాటు పరిస్థితులు, అదృష్టం.. ఇలా ప్రతిదీ కలసిరావాలి. క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ ఆశ వరల్డ్ కప్​ విన్నింగ్​ టీమ్​లో భాగమవ్వాలి, కప్​ను చేతపట్టుకోవాలి. ఇప్పుడంటే టీ20ల రాకతో ఆ ఫార్మాట్​లో రెండేళ్లకు ఓసారి ప్రపంచ కప్​ను నిర్వహిస్తున్నారు. కానీ వన్డేల్లో నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వరల్డ్ కప్ జరుగుతుంది. అందుకే ఈ ఫార్మాట్​లో కప్ కోసం జరిగే మ్యాచ్​లను చూసేందుకు ఆడియెన్స్​ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్​కు ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 2011 తర్వాత వరల్డ్ కప్​ను ఇండియా హోస్ట్ చేయడం ఇదే ప్రథమం. ఆ ప్రపంచ కప్​ను టీమిండియా ఒడిసిపట్టింది. ఈ నేపథ్యంలో ఇది మరోసారి రిపీట్ అవుతుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఇవాళ వన్డే వరల్డ్ కప్​ షెడ్యూల్​ను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా టోర్నీపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈసారి వరల్డ్ కప్​ కష్టంగా ఉండబోతోందన్నాడు. ఈమధ్య కాలంలో క్రికెట్​లో వేగంగా మార్పులు వచ్చాయని.. గేమ్​లో స్పీడ్ పెరిగిందన్నాడు హిట్​మ్యాన్. ప్రతి జట్టు ఇంతకుముందు కంటే ఇప్పుడు మరింత పాజిటివ్​గా ఆడుతోందన్నాడు. ఈ ట్రోఫీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ పేర్కొన్నాడు.