IPL 2024 Auction: ఐపీఎల్ వేలం.. ఎవరా ఇద్దరు? పంజాబ్ పక్కా ప్లాన్స్!
ఈ ఏడాది వేలంలో పంజాబ్ కింగ్స్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి. ఐపీఎల్ 2024 కోసం డిసెంబర్ 19న దుబాయ్లో వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ వద్ద రూ.29.10 కోట్లు మిగిలాయి.

IPL 2024 Auction: గత ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ను రికార్డు ధర రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కారణంగా సామ్ కరన్ IPL చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. అయితే, IPL 2023లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. అందుకే ఈ సంవత్సరం వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ అతనిని విడుదల చేసింది. ఇది కాకుండా పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది మరో ఖరీదైన భారత ఆటగాడు షారుక్ ఖాన్ను కూడా విడుదల చేసింది.
IPL 2024 Auction: కత్తిలాంటి ఐడియాలతో కావ్య పాప.. ఐపీఎల్ వేలంలో ఇదే ప్లాన్..
మరి ఈ ఏడాది వేలంలో పంజాబ్ కింగ్స్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి. ఐపీఎల్ 2024 కోసం డిసెంబర్ 19న దుబాయ్లో వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ వద్ద రూ.29.10 కోట్లు మిగిలాయి. ఈ వేలానికి ముందు వారు 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. కేవలం ఐదుగురు ఖరీదైన ఆటగాళ్లను మాత్రమే విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ వద్ద మొత్తం 8 స్లాట్లు మిగిలి ఉన్నాయి. అందులో విదేశీ స్లాట్ల సంఖ్య కేవలం 2 మాత్రమే. ఈ క్రమంలో తక్కువ ఎకానమీ రేట్ కలిగిన మంచి స్పిన్ బౌలర్ కోసం ఆ జట్టు చూస్తోంది. ఇంగ్లాండ్కు చెందిన ఆదిల్ రషీద్, న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర లేదా శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా వంటి ఆటగాళ్లను దక్కించుకునేందుకు పంజాబ్ జట్టు ఎదురుచూస్తోంది. ఈ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టు అత్యంత ఖరీదైన, స్టార్ ఆల్ రౌండర్ శామ్ కరన్ను విడుదల చేసింది.
ఈ క్రమంలో పంజాబ్ జట్టుకు ఆల్రౌండర్ అవసరం తప్పనిసరి. ఇంగ్లండ్కు చెందిన క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్ లేదా ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ను దక్కించుకునే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు షారుక్ ఖాన్ను విడుదల చేసిన నేపథ్యంలో ఆ పంజాబ్ జట్టుకు ఫినిషర్ అవసరం కూడా ఉంది. ఈ స్థానం కోసం శార్దూల్ ఠాకూర్ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి.