ఐపీఎల్ మజా షురూ ఫ్యాన్స్ కు కిక్కిస్తున్న మ్యాచ్ లు

ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ లు కాస్త వన్ సైడ్ గా జరిగినట్టు అనిపించినా రెండో వారం తర్వాత నుంచి మాత్రం రసవత్తరంగా సాగుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2025 | 04:00 PMLast Updated on: Apr 17, 2025 | 4:00 PM

Ipl Maja Shuru Fans Are Excited About The Matches

ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ లు కాస్త వన్ సైడ్ గా జరిగినట్టు అనిపించినా రెండో వారం తర్వాత నుంచి మాత్రం రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్నప్పటి నుంచి కొన్ని జట్లు అదరగొడుతున్నాయి. ఈ క్రమంలో హోరాహోరీ హై స్కోరింగ్ మ్యాచ్ లే కాదు లో స్కోరింగ్ థ్రిల్లర్ ను కూడా చూశాం. ఇప్పుడు సూపర్ ఓవర్ మజా కూడా అభిమానులను అలరించింది. నిజానికి టాప్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్‌లు వరుస ఓటములు చెందడం.. గుజరాత్, ఢిల్లీ లాంటి జట్లు వరుస విజయాలతో దూసుకుపోవడంతో మ్యాచ్‌లు చూడాలంటేనే ఫ్యాన్స్‌కే చిరాకు వచ్చేసింది. సీఎస్కే అయితే దారుణంగా ఐదు ఓటములు చెంది ఆఖరికి తలా మీదే విమర్శలు తెచ్చే స్థాయికి తెచ్చింది. దాంతో ఐపీఎల్ వ్యూయర్‌షిప్ రోజురోజుకూ పడిపోయింది. కానీ మూడ్రోజుల నుంచి జరిగే మ్యాచ్‌లో ఐపీఎల్‌లో మళ్లీ మజా తెచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి థ్రిల్లింగ్ మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌కి కిక్కిస్తున్నాయి.

రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి దూరం కావడంతో ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో కోల్‌కతాపై దారుణ ఓటమిని మూటగట్టుకున్నాడు. కానీ ఏప్రిల్ 14, సోమవారం రోజు జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో లక్నోపై విజయం సాధించారు. ఆ మ్యాచ్‌లో కూడా ధనాధన్ ధోనీ సిక్సర్లు, ఫోర్లతో మ్యాచ్‌ని ముగించి సీఎస్కే వరుస ఓటములకు బ్రేక్ వేశాడు. అంతకు ముందు ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ వరుసగా మూడు రనౌట్‌లు చేసి ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది.

ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య లో స్కోరింగ్ హై టెన్షన్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ హోం గ్రౌండ్‌లో కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. లో స్కోర్ మ్యాచ్‌ని ఈజీగా ఛేజ్ చేస్తుందనుకున్న కోల్‌కతా 95 పరుగులకే ఆలౌట్ అయింది. నరాలు తెగే ఉత్కంఠభరిత ఈ మ్యాచ్‌ని ఐపీఎల్ ఫ్యాన్స్ ఆద్యంతం ఎంతో టెన్షన్‌తో వీక్షించారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ టైగా ముగిసింది. ఎప్పుడో నాలుగేళ్ల కిందట ఐపీఎల్ 2021లో ఢిల్లీ – సన్‌రైజర్స్ మధ్య సూపర్ ఓవర్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ 2025లో ఢిల్లీ – రాజస్థాన్ మధ్య సూపర్ ఓవర్ వచ్చింది. ఈ సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌తో రాజస్థాన్‌కు అడ్డుకట్ట వేసి 12 పరుగలను నాలుగు బంతుల్లోనే ఛేదించి విజయం సాధించింది. ఇలా చతికిలపడిన ఐపీఎల్ 2025లో వరుసగా జరిగిన మూడు మ్యాచ్‌లు కాస్తంత ఊపిరి పోశాయి. ఈ సీజన్‌లో ఇంకా ఇలాంటి థ్రిల్లింగ్ విక్టరీలు ఇంకెన్ని చూడాలో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు ముందే ఇన్ని ట్విస్ట్‌లు ఉంటే ఇక క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఇంకెంత రసవత్తరంగా జరుగుతుందో వేచి చూడాలి.