పాత జట్టు మీద ప్రేమా….ఫిక్సింగా ? ఇషాన్ కిషన్ పై ఫాన్స్ ఫైర్

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆ జట్టు హోం గ్రౌండ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2025 | 05:45 PMLast Updated on: Apr 24, 2025 | 5:45 PM

Is Love For The Old Team Fixed Fans Fire At Ishan Kishan

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆ జట్టు హోం గ్రౌండ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఔట్ తీవ్ర దుమారం రేపింది. నిజానికి దీపక్ చాహర్ వేసిన బంతికి ఎటువంటి అప్పీల్ లేకుండానే అంపైర్ ఇషాన్ కిషన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. అసలు వింత ఏమిటంటే ఇషాన్ కిషన్ కూడా అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు.

ఇషాన్ కిషన్ రివ్యూ కూడా తీసుకోలేదు. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ గురించి సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఇషాన్ కిషన్ కీపర్ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. అతని బ్యాట్ బంతిని తాకిందో లేదో కూడా అతనికి తెలియదు. అటువంటి పరిస్థితిలో, అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో కూడా వైరల్ అవుతోంది.ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ముంపబై తరఫున ఆడుతున్నాడా అనే ప్రశ్న కూడా వచ్చింది. అలాగే ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

ఐదు ఛాంపియన్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ జట్టుతో తన ఐపీఎల్ కెరీర్ ను ప్రారంభించిన ఇషాన్ కిషన్ ఇంకా ముంబై తరపున ఆడుతున్నాడా అని అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్ రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోవడంపై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పేలవంగా ఆడుతుండడంతో అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన ఇషాన్ కిషన్ ఔట్ కాకుండా తనంతట తానుగా పెవిలియన్ వైపు నడిచి వెళ్లడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.