Jasprit Bumrah: నాలుగో టెస్టుకు ముందు భారత్‌కు షాక్.. రాంచీ మ్యాచ్‌కు స్టార్ పేసర్ దూరం

రాంఛీ టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్‌ కారణంగా బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2024 | 03:39 PMLast Updated on: Feb 19, 2024 | 3:39 PM

Jasprit Bumrah To Be Rested For India Vs England 4th Test In Ranchi

Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు రాంచీ వేదికగా నాలుగో టెస్టుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టెస్టు సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మంగళవారం రాంచీకి చేరుకోనున్న భారత జట్టు.. బుధవారం నుంచి ప్రాక్టీస్‌ మొదలు పెట్టనుంది.

Yashasvi Jaiswal: డబుల్ సెంచరీ చేసినా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కని జైస్వాల్

అయితే రాంఛీ టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్‌ కారణంగా బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుమ్రా.. రాజ్‌కోట్‌ నుంచి నేరుగా తన స్వస్థలం అహ్మదాబాద్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐదో టెస్టుకు కూడా బుమ్రా అందుబాటులో ఉంటాడా.. లేదా.. అన్నది నాల్గవ టెస్ట్ ఫలితంపై ఆధారపడి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సిరీస్‌లో బుమ్రా దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టి ఈ సిరీస్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.

బూమ్రా లేకుంటే నాలుగో టెస్టుతో యువ పేసర్‌ ఆకాష్‌ దీప్‌ అరంగేట్రం చేసే ఛాన్స్‌ ఉంది. ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.