Katrina Kaif : బ్రాండ్ అంబాసిడర్ గా కత్రినా కైఫ్

ఐపీఎల్ 17వ సీజన్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మార్చి చివరి వారంలో లీగ్ ఆరంభమై మే నెలలో టోర్నీ ముగిసేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తన ప్రచారానికి దూకుడు పెంచింది. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను నియమించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2024 | 12:24 PMLast Updated on: Feb 14, 2024 | 12:24 PM

Katrina Kaif As Brand Ambassador

ఐపీఎల్ 17వ సీజన్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మార్చి చివరి వారంలో లీగ్ ఆరంభమై మే నెలలో టోర్నీ ముగిసేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తన ప్రచారానికి దూకుడు పెంచింది. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను నియమించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ స్పాన్సర్ ఎతిహద్‌ ఎయిర్‌వేస్‌కు కత్రినా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇటీలవ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహద్ ఎయిర్‌వేస్ కంపెనీకి సీఎస్‌కే స్పాన్సర్‌షిప్ హక్కులు ఇచ్చింది. ఎతిహద్‌కు ప్రచారకర్తగా ఉన్న కత్రినాకైఫ్ ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై తరఫున బరిలోకి దిగనుంది. గతంలో ఈ బాలీవుడ్ బ్యూటీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. ఇదిలా ఉంటే గత సీజన్‌‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న చెన్నై ఈ సీజన్‌లోనూ కప్‌ను సాధించాలని కసితో ఉంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపట్టాడు.