MI vs RCB: ముంబై , బెంగుళూరు మ్యాచ్‌పై అనుమానాలు.. టాస్ ఫిక్సింగ్ చేసారా ?

టాస్‌ సమయంలో ఏదో జరిగిందని చర్చించుకుంటున్నారు. మ్యాచ్‌ రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌ టాస్‌ ఫలితాన్ని తారుమారు చేశాడని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్‌ అంటేనే ఫిక్సింగ్‌ అని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2024 | 08:36 PMLast Updated on: Apr 12, 2024 | 8:36 PM

Mi Vs Rcb Match Was Toss Fixed Here Is The Details

MI vs RCB: వాంఖడే వేదికగా ముంబై, ఆర్సీబీ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌పై పలువురు క్రికెట్‌ అభిమానులు అనుమానం వ్యక్తిం చేస్తున్నారు. టాస్‌ సమయంలో ఏదో జరిగిందని చర్చించుకుంటున్నారు. మ్యాచ్‌ రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌ టాస్‌ ఫలితాన్ని తారుమారు చేశాడని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్‌ అంటేనే ఫిక్సింగ్‌ అని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.

ROHIT SHARMA: రిటైర్మెంటా.. ఎవరు చెప్పారు..? 2027 వరల్డ్ కప్ కూడా ఆడతా..!

నిన్నటి మ్యాచ్‌లో ముంబై గెలవాలని ముందుగానే ఫిక్స్‌ అయ్యిందని అంటున్నారు. శ్రీనాథ్‌ టాస్‌ ఫలితాన్ని మార్చాడనటానికి ఇదే సాక్ష్యం అంటూ ఓ వీడియోని పోస్ట్‌ సోషల్‌మీడియాలో చేశారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆర్సీబీని ఓడించింది. ప్రస్తుతం ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

మరోవైపు ఆర్సీబీ 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడబోయే 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే ఈ సీజన్‌లోనూ ఆర్సీబీ రిక్త హస్తాలతోనే వెనుదిరగాల్సి వస్తుంది.