ICC WORLD CUP: ఆల్ ది బెస్ట్ టీమిండియా.. మ్యాచ్ విన్నర్ మనమే అంటున్న టాలీవుడ్ స్టార్..

తొలి సెమీ ఫైనల్స్‌పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, లెజెండరీ ప్లేయర్లు.. తమ తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో అంచనా. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఈ జాబితాలో చేరాడు. తొలి సెమీస్‌లో గెలిచే జట్టు భారత్ అంటూ వెల్లడించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2023 | 07:35 PMLast Updated on: Nov 14, 2023 | 7:38 PM

Naga Chaitanya Predicts India Vs New Zealand Semi Final Match Winner

ICC WORLD CUP: వరల్డ్ కప్ చివరి మజిలీకి ఇంకో రెండు అడుగుల దూరం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తొలి సెమీ ఫైనల్.. భారత్- న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖెడే స్టేడియంలో.. రెండోది దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్నాయి. 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది.

India vs New Zealand: ధోనీ రనౌట్‌పై ప్రతీకారానికి భారత్ రెడీ..

తొలి సెమీ ఫైనల్స్‌పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, లెజెండరీ ప్లేయర్లు.. తమ తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో అంచనా. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఈ జాబితాలో చేరాడు. తొలి సెమీస్‌లో గెలిచే జట్టు భారత్ అంటూ వెల్లడించాడు. దీనిపై స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఓ చిన్న ప్రొమోను విడుదల చేసింది. న్యూస్ పేపర్ చేతిలో పట్టుకుని ఈ హెడ్ లైన్‌ను చదువుతాడు అక్కినేని నాగచైతన్య. ఫ్యూచర్ డిసైడ్ చేసి తాను చెప్పట్లేదని, జట్టు పెర్‌ఫార్మెన్స్, దూకుడును చూస్తే మీకే అర్థమౌతుందనీ వివరించాడు.

తాను ఒక్కడినే కాదని, ఇండియా మొత్తం ఇదే కోరుకుంటోందని పేర్కొన్నాడు. టీమిండియా దూతగా జర్నలిస్ట్.. సాగర్ అంటూ ముగించాడు. ‘దూత’ వెబ్ సిరీస్‌లో నటించాడు నాగచైతన్య. ఈ సిరీస్ డిసంబర్ 1వ తేదీన విడుదల కానుంది.