తలైవా స్టైల్ లో ఫోటో చెన్నైటీమ్ లోకి పంత్ ?

ఐపీఎల్ రిటెన్షన్ నిబంధనలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు... మెగా వేలం ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఫ్రాంచైజీలు మాత్రం ఏఏ ఆటగాళ్ళను రిటైన్ చేసుకోవాలి... వేలంలో ఎవరి కోసం ప్రయత్నించాలనే దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 21, 2024 | 07:38 PMLast Updated on: Aug 21, 2024 | 7:38 PM

Photo In Thalaiva Style Chennaiteam Loki Pant

ఐపీఎల్ రిటెన్షన్ నిబంధనలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు… మెగా వేలం ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఫ్రాంచైజీలు మాత్రం ఏఏ ఆటగాళ్ళను రిటైన్ చేసుకోవాలి… వేలంలో ఎవరి కోసం ప్రయత్నించాలనే దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు కొందరు ప్లేయర్స్ కూడా తమ పాత ఫ్రాంచైజీలను వీడి కొత్త జట్లతో జత కట్టేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆ జట్టు వీడతాడన్న ప్రచారం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇటీవలే గంగూలీ క్లారిటీ ఇచ్చినప్పటకీ పంత్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటో మళ్ళీ ఊహాగానాలకు తెరతీసింది. పంత్‌ తన ఇన్‌స్టా లో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్టైల్‌లో ఫొటో దిగి పెట్టాడు. దీనికి తలైవా అంటూ క్యాప్షన్‌ ఇవ్వడంతో పలు రుమార్లు షికారు చేస్తున్నాయి. పంత్ ఫోటోపై క్రికెట్‌ అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

పంత్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు వెళ్లడం ఖాయమని.. అందుకే అక్కడి అభిమానులు ఆరాధించే రజనీ స్టైల్‌లో ఫొటో దిగి పెట్టాడని అంటున్నారు. చెన్నైలోకి తాను వస్తున్నట్లు ఇన్​డైరెక్ట్​గా అతడు చెప్పేశాడని తేల్చేస్తున్నారు. అప్పట్లో చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇలాగే తలైవా రజినీ స్టైల్​లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇప్పుడు మాహీ కెరీర్ ముగుస్తుండటంతో ఆ ప్లేస్​ను పంత్ భర్తీ చేసే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. ఒకవేళ ఢిల్లీ పంత్ ను రిటైన్ చేసుకోకుంటే వేలంలో అతని కోసం చెన్నై ప్రయత్నించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్​తో సిరీస్​కు ముందు రెస్ట్ తీసుకున్న పంత్.. ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్​లో ఆడుతున్నాడు. త్వరలో జరిగే దులీప్ ట్రోఫీలోనూ బరిలోకి దిగుతాడు.