ఆర్సీబీ అన్ బాక్స్ ఈవెంట్, స్టేడియానికి పోటెత్తిన ఫ్యాన్స్
ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభానికి ఇంకా మూడురోజులే సమయముంది. ఇప్పటికే పలు నగరాల్లో ఐపీఎల్ ఫీవర్ పెరిగిపోయింది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మెగా సీజన్ కోసం రెడీ అవుతోంది.

ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభానికి ఇంకా మూడురోజులే సమయముంది. ఇప్పటికే పలు నగరాల్లో ఐపీఎల్ ఫీవర్ పెరిగిపోయింది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మెగా సీజన్ కోసం రెడీ అవుతోంది. ఎప్పటిలానే ఆ జట్టు ప్రతీ ఏటా నిర్వహించే
ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్తో చిన్నస్వామి స్టేడియం నిండిపోయింది. టికెట్లు కొనుక్కుని మరీ.. ఆ జట్టు ఫ్యాన్స్ స్టేడియానికి తరలివచ్చారు. దీంతో ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే.. చిన్నస్వామి స్టేడియంలో సందడి మొదలైంది.స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్తో కబుర్లు చెప్పుకునేందుకు ఆటగాళ్లంతా వచ్చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ ధగధగలతో స్టేడియం మెరిసిపోయింది. ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ ఆ జట్టు ఫ్యాన్స్ చేసిన నినాదాలతో స్టేడియం హోరెత్తిపోయింది. ఇక ఈ సీజన్ ద్వారా తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి అడుగుపెట్టిన ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెతెల్ వంటి ప్లేయర్లు ఆర్సీబీ ఫ్యాన్స్ను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. కోహ్లీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది… విరాట్ స్టేడియంలోకి రాగానే కోహ్లీ..కోహ్లీ నామస్మరణతో హోరెత్తిపోయింది.
ఫ్యాన్స్ను ఉత్సాహపరించేందుకు ఆర్సీబీ ఫ్రాంఛైజీ.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో ఆటపాటల ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. స్పెషల్ లైట్ షో ఏర్పాటు చేయడంతో పాటు క్రాకర్స్ కాల్చింది. అలాగే జట్టులోని ప్లేయర్లతో సిక్స్ హిట్టింగ్ ఛాలెంజ్ నిర్వహించింది. వెస్టిండీస్ ప్లేయర్ రొమారియో షెఫర్డ్ అందరికంటే ఎక్కువ దూరం బంతిని బాది విజయం సాధించాడు.దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తొలుత ఫిలిప్ సాల్ట్ ఈ పోటీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత రొమారియో షెఫర్డ్ భారీ సిక్స్ కొట్టాడు. అనంతరం చాలా మంది ప్లేయర్లు ఈ పోటీలో పాల్గొన్నా.. షెఫర్డ్ సిక్స్ను బీట్ చేయలేకపోయారు. లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెతెల్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ లాంటి ప్లేయర్లు ఈ పోటీలో పాల్గొన్నారు. చివరకు రొమారియో షెఫర్డ్ను విజేతగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సిక్స్ హిట్టింగ్కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గురు ఆటగాళ్లన ురిటైన్ చేసుకుంది. అందులో విరాట్ కోహ్లీతో పాటు రజత్ పటీదార్ కూడా ఉన్నాడు. మరో ప్లేయర్గా యశ్ దయాళ్ రిటైన్ అయ్యాడు. అయితే రూ.11 కోట్లకు రజత్ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. మెగా వేలంలో కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇక ఫాఫ్ డుప్లెసిస్ను వదిలిపెట్టడంతో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో గతంలో ఆర్సీబీకి కెప్టెన్గా ఉన్న కోహ్లీకే మళ్లీ పగ్గాలు అప్పగిస్తారని అంతా ఊహించారు. కానీ విరాట్ కెప్టెన్సీ వద్దనడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా.. ఆర్సీబీ రజత్ పటీదార్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ఆర్సీబీ, కోల్ కత్తా నైట్ రైడర్స్ తో మార్చి 22న తలపడనుంది.