Rohit Sharma: వెంకన్న సేవలో ఇండియా కెప్టెన్

రోహిత్ సతీమణి రితిక సజ్దే, కూతురు సమైరా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు భారత కెప్టెన్‌కు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. రోహిత్ శర్మ, రితిక సజ్దే తిరుమల ఆలయంలో నడుచుకుంటూ వస్తున్న వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 13, 2023 | 04:54 PMLast Updated on: Aug 13, 2023 | 4:54 PM

Rohit Sharma Visits Tirupathi Balaji Temple Ahead Of Asia Cup

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం రోహిత్ తన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రోహిత్ సతీమణి రితిక సజ్దే, కూతురు సమైరా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు భారత కెప్టెన్‌కు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. రోహిత్ శర్మ, రితిక సజ్దే తిరుమల ఆలయంలో నడుచుకుంటూ వస్తున్న వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రోహిత్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. అయితే భారీ సెక్యూరిటీ ఉండడంతో వారికి నిరాశ తప్పలేదు. ఆగష్టు చివరలో ఆసియా కప్‌ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆసియా కప్‌ ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమలకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రోహిత్ ఇటీవలే వెస్టిండీస్ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. టెస్ట్, వన్డేలు ఆడిన రోహిత్.. టీ20 సిరీస్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌లో టీ20 టోర్నీలో పాల్గొంటుంది.