శ్రేయాస్, సూర్య ఫ్లాప్ షో నిరాశపరిచిన భారత క్రికెటర్లు

టెస్ట్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ క్రికెట్ రీఎంట్రీలో నిరాశపరిచారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2024 | 05:40 PMLast Updated on: Aug 29, 2024 | 5:40 PM

Shreyas Surya Flop Show Disappointing Indian Cricketers

టెస్ట్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ క్రికెట్ రీఎంట్రీలో నిరాశపరిచారు. బుచ్చిబాబు టోర్నీలో ముంబై జట్టుకు ఆడుతున్న వీరిద్దరూ తొలిరోజు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ 2 పరుగులే చేసి ఔటవగా… సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ తో 30 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఫలితంగా ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఈ టోర్నీలో రాణించి బంగ్లాతో సిరీస్ కు ముందు సెలక్టర్ల దృష్టిలో పడాలని శ్రేయస్, సూర్యకుమార్ భావించారు. తొలి మ్యాచ్ లోనే విఫలమై నిరాశపరిచారు.