PSPB సెంట్రల్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో భారత స్టార్ షట్లర్లు

బ్యాడ్మింటన్ హబ్ గా మారిన హైదరాబాద్ లో మరో మెగా టోర్నీ ప్రారంభమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 5, 2024 | 07:26 PMLast Updated on: Sep 05, 2024 | 7:26 PM

Star Shuttlers Of India In Pspb Central Zone Badminton Tournament

బ్యాడ్మింటన్ హబ్ గా మారిన హైదరాబాద్ లో మరో మెగా టోర్నీ ప్రారంభమైంది. పెట్రోలియమ్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను భారత జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో భారత్ టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆడుతున్నారు.
పురుషుల సింగిల్స్ టాప్ ప్లేయర్ లక్ష్యసేన్ , హెచ్ ఎస్ ప్రణయ్, డబుల్స్ స్టార్ ప్లేయర్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, వుమెన్ డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్పతో పాటు పలువురు యంగ్ షట్లర్స్ బరిలో ఉన్నారు. గత కొన్నేళ్ళుగా బ్యాడ్మింటన్ మంచి సపోర్ట్ ఇస్తున్న పెట్రోలియమ్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు గోపీచంద్ థాంక్స్ చెప్పారు. రానున్న రోజుల్లో మిగిలిన క్రీడలనూ ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పెట్రోలియమ్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు నిర్వాహకులు తెలిపారు.