Suryakumar Yadav: స్కై వచ్చేశాడు.. ముంబై బోణీ కొడుతుందా..?

గత 2 వారాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న సూర్య ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వచ్చాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ జట్టులో కూడా చేరాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన సూర్యకుమార్ అదే రోజు ప్రాక్టీస్‌కు వెళ్లాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 6, 2024 | 04:27 PMLast Updated on: Apr 06, 2024 | 4:28 PM

Suryakumar Yadav Back In The Team Of Mumbai Indians Face Delhi Capitals At Wankhede

Suryakumar Yadav: ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. హార్దిక పాండ్య కెప్టెన్సీ వైఫల్యం కారణంగా ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ జట్టుకు జోష్ వచ్చింది. దీనికి కారణం స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ జట్టుతో చేరడమే. గత 2 వారాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న సూర్య ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వచ్చాడు.

Raghu Rama Krishna Raju: రఘురామకు టీడీపీ టిక్కెట్.. ఉండి నుంచి బరిలోకి

శుక్రవారం ముంబై ఇండియన్స్ జట్టులో కూడా చేరాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన సూర్యకుమార్ అదే రోజు ప్రాక్టీస్‌కు వెళ్లాడు. కాబట్టి, తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా ఉంటాడని చెప్పొచ్చు. మూడు వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ రాక కొత్త బలాన్ని నింపనుంది. ఎందుకంటే, గత మూడు మ్యాచ్‌ల్లో ముంబై జట్టు మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో జట్టుకు విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 17 సీజన్ లోకి ప్రవేశించాడు.

ప్రస్తుతం టీ20 స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ రాకతో ముంబై జట్టు బ్యాటింగ్ బలం పెరుగుతుంది.ముంబై ఇండియన్స్ తరపున 85 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 2688 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 20 అర్ధ సెంచరీలు చేశాడు. మరి స్కై ఎంట్రీ వచ్చే మ్యాచ్‌లోనైనా ముంబై ఇండియన్స్ విజయాల ఖాతా తెరుస్తుందో లేదో వేచి చూడాలి.