West Indies Tour: అందరూ ఉండి కూడా ఆసీస్ తో ఓడిపోయారు.. ఇప్పుడు ఏకంగా ఆ నలుగురు లేకుండా విండీస్ కు
టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెలలో వెస్టిండీస్ టీంతో మూడు ఫార్మాట్లలో తలపడనుంది. అయితే, ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల మేరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు వన్డే, టీ20 సిరీస్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

india vs west indies tour
ఇటువంటి పరిస్థితిలో ఈ ఇద్దరు ఆటగాళ్లు 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను మాత్రమే ఆడతారని అంటున్నారు. అయితే, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలు ఏ సిరీస్లోనూ అందుబాటులో ఉండరు. వెస్టిండీస్ పర్యటనలో ఇద్దరు స్టార్ ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్ వంటి చాలా మంది యువ ఆటగాళ్లు వన్డే, టెస్ట్, టీ20 సిరీస్లలో భాగం అవుతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వైట్ బాల్ జట్టులో శాంసన్, ఉమ్రాన్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. జైస్వాల్, అర్ష్దీప్లు టెస్ట్ జట్టులో భాగంగా ఉంటారని అంటున్నారు. “హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఒక ఎంపిక. కానీ, టెస్ట్ రిటర్న్లో హార్దిక్ అభిప్రాయం తప్పక తీసుకోవాలి. సెలెక్టర్లు అతనిని వైట్ జెర్సీలో చూడాలనుకుంటున్నారు. కానీ, అతను మూడు ఫార్మాట్లలో ఆడే స్థితిలో ఉన్నాడా, ముఖ్యంగా అతను వన్డేలలో ముఖ్యమైన ఆటగాడు అని, అది హార్దిక్ మాత్రమే నిర్ణయించుకోవాలి” అంటూ ఇన్సైడ్ స్పోర్ట్స్ తన నివేదికల్లో ప్రకటించింది.