హైదరాబాద్ కెప్టెన్ గా తిలక్ వర్మ రంజీ ట్రోఫీకి జట్టు ఇదే

దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టుకు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2024 | 04:03 PMLast Updated on: Oct 02, 2024 | 4:03 PM

Tilak Verma As Captain Of Hyderabad

దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టుకు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. తొలి రెండు మ్యాచ్ లకు మాత్రమే హెచ్ సీఎ జట్టును ఎంపిక చేయగా.. వైస్ కెప్టెన్‌గా రాహుల్ సింగ్ కు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టు.. రంజీ ట్రోఫీలోనూ సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నీలో జార్ఖండ్, మధ్యప్రదేశ్‌, తమిళనాడు జట్లను ఓడించింది. కాగా రంజీ ట్రోఫీ గ్రూప్-బీలో ఉన్న హైదరాబాద్ జట్టు తొలి రౌండ్ షెడ్యూల్‌లో గుజరాత్, ఉత్తరాఖండ్‌లతో తలపడనుంది. అక్టోబర్ 11 నుంచి గుజరాత్‌తో, 18వ తేదీ నుంచి ఉత్తరాఖండ్‌తో పోటీపడనుంది.