కోహ్లీ ఇక కేరాఫ్ లండన్ ప్రైవసీ కోసమే నిర్ణయం

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2024 | 07:46 PMLast Updated on: Aug 16, 2024 | 7:46 PM

Virat Kohili Decided To Move To London

టీమిండియా స్టార్ క్రికెటర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఇండియాలో అయితే అతని క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే… ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు, ఆటోగ్రాఫులు, సెల్ఫీలు అంటూ వెంటపడతారు.. ఒక్కోసారి ఈ సెలబ్రిటీ లైఫ్ చిరాకు తెప్పిస్తుందని గతంలో విరాట్ పలు సందర్భాల్లో చెప్పాడు. అందుకే ఏదైనా సిరీస్ ముగిసిన వెంటనే ఫ్యామిలీ తీసుకుని వెకేషన్ కు చెక్కేస్తుంటాడు. తనను ఎవరూ గుర్తుపట్టని దేశాల్లోనూ విరాట్ ఎక్కువగా గడుపుతుంటాడు. ఇకపై కోహ్లీ ఇలాంటి లైఫ్ నే లీడ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఇకపై కేరాఫ్ లండన్ అడ్రస్ లో ఉండనున్నాడు.

సెలబ్రిటీ లైఫ్ కు దూరంగా ప్రైవసీ కోసమే భారత స్టార్ క్రికెటర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఎప్పటి నుంచో కోహ్లీ లండన్ లో సెటిలవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో చాలాసార్లు ఫ్యామిలీతో అక్కడే గడుపుతున్న ఫోటోలు కూడా వచ్చాయి. లండన్ లో కోహ్లీ, అనుష్క జోడీ ఇల్లు కూడా తీసుకున్నట్టు సమాచారం. అలాగే తన పిల్లల కోసం మంచి స్కూల్ ను కూడా
డిసైట్ చేశాడు. ఇన్ స్టాలో లండన్ కు చెందిన ఒక స్కూల్ ను కూడా ఫాలో అవుతుండడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి. ఇటీవల లండన్ వీధుల్లో సిగ్నల్ లైట్స్ దగ్గర రోడ్డు దాటేందుకు నిలబడిన కోహ్లీ ఫోటో కూడా వైరల్ గా మారింది. అక్కడైతే ఫ్యాన్స్ ఎవ్వరూ పెద్దగా వెంటపడరని భావించే కోహ్లీ, అనుష్క జోడీ లండన్ కు షిప్ట్ అయినట్టు తెలుస్తోంది.