జైషా వారసుడెవరు ? రేసులో ఉన్నది వీళ్ళే

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2024 | 05:55 PMLast Updated on: Aug 24, 2024 | 5:55 PM

Who Is The Next Bcci Secretary

బీసీసీఐ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్ గా ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా నామినేషన్ వేయకపోయినప్పటకీ ఐసీసీలోకి వెళ్ళేందుకు జైషా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైతే తర్వాతి బీసీసీఐ సెక్రెటరీ ఎవరనే దానిపై చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ పోటీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజీశ్ శుక్లా రెండు దశాబ్దాలకు పైగా బీసీసీఐలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే, అరుణ్ ధుమాల్ గతంలో బీసీసీఐ ట్రెజరర్‌గా పని చేశాడు. ప్రస్తుత ట్రెజరర్ ఆశిష్ కూడా గట్టిపోటీదారుడుగానే చెబుతున్నారు.