World Cup Tickets: వరల్డ్ కప్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ.57 లక్షలు.. షాకవుతున్న ఫ్యాన్స్..!

భారత మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లు భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని టిక్కెట్‌లను విక్రయించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 5, 2023 | 07:18 PMLast Updated on: Sep 05, 2023 | 7:18 PM

World Cup Tickets At 56 Lakh For India Vs Pakistan Match Netizens Questions Bcci

World Cup Tickets: వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. టోర్నీలో తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. భారత మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లు భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని టిక్కెట్‌లను విక్రయించాయి. వయాగోగో పేరుతో ఉన్న టికెట్ వెబ్‌సైట్‌లో అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ టిక్కెట్‌లు లక్షల్లో అమ్ముడుపోతున్నాయి.

వెబ్‌సైట్‌లో ఎగువ శ్రేణి విభాగానికి చెందిన టికెట్ ధర రూ.57 లక్షలకు పైగా ఉన్నట్లు కనిపిస్తోంది. సెక్షన్ ఎన్6 పరిస్థితి కూడా అదే. ఈ విభాగంలో కూడా టికెట్ ధర రూ.57 లక్షలకు పైగానే చూపుతోంది. ఈ వెబ్‌సైట్‌లో అతి తక్కువ టికెట్ ధర రూ.80 వేలు. 2023 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ అక్టోబర్‌ 8న జరగనుంది. ఈ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. పెరిగిన టిక్కెట్ ధరలపై అభిమానులు సోషల్ మీడియాలో బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు.

ఒక అభిమాని ట్విట్టర్ లో ఇండియా–ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ టిక్కెట్ ధరను పేర్కొన్నాడు. దీని ధర కూడా లక్షల్లోనే ఉంది. వయాగోగోలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్‌ల ధరలు రూ.41,000 నుంచి రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి. ఇంగ్లండ్‌తో భారత్ ప్రపంచకప్ మ్యాచ్ ధర రూ.2.3 లక్షలకు పైగా ఉంది. చరిత్రలో నిలిచిపోయే టికెట్ ధరలు, వర్షాకాలంలో కూడా అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయి.