ఇంపాక్ట్ చూపించాడుగా మలుపు తిప్పిన యంగ్ పేసర్
ఐపీఎల్ 2025 సీజన్ ను పంజాబ్ కింగ్స్ విజయంతో స్టార్ట్ చేసింది. సొంతగడ్డపై గుజరాత్ కు షాకిస్తూ 11 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్లో దుమ్మురేపిన శ్రేయ్యర్ సారథ్యంలోని పంజాబ్..

ఐపీఎల్ 2025 సీజన్ ను పంజాబ్ కింగ్స్ విజయంతో స్టార్ట్ చేసింది. సొంతగడ్డపై గుజరాత్ కు షాకిస్తూ 11 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్లో దుమ్మురేపిన శ్రేయ్యర్ సారథ్యంలోని పంజాబ్.. ఆ తర్వాత చివరి ఓవర్లలో మెరుగైన బౌలింగ్తో మ్యాచ్ను కాపాడుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన యంగ్ పేసర్ వైశాఖ్ విజయ్ కుమార్ అదరగొట్టాడు. తన బౌలింగ్తో మ్యాచ్ను మలుపుతిప్పి ఒక్క వికెట్ తీయకుండానే హీరో అయ్యాడు. నిజానికి ఎంత బ్యాటింగ్ వికెట్ అయినా 244 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ గుజరాత్ కాన్ఫిడెంట్ గానే ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పవర్ ప్లేలోనూ, ఆ తర్వాత కూడా ఎక్కువ వికెట్లు కోల్పోకుండా దూకుడుగా ఆడింది. ఒక దశలో 4 ఓవర్లలో 2 వికెట్లకు 169 రన్స్ చేసింది. విజయానికి ఆరు ఓవర్లలో 75 పరుగులు చేయాల్సింది. జాస్ బట్లర్, రూథర్ఫర్డ్ సూపర్ హిట్టింగ్ చేస్తుండడం.. పిచ్ బ్యాటింగ్కు బాగుండటంతో పంజాబ్ కింగ్స్ ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో శ్రేయాస్ అయ్యర్ తన కెప్టెన్సీ మార్క్ చూపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వైశాఖ్ విజయ్ కుమార్ను బౌలింగ్కు దింపాడు.
15వ ఓవర్లో వైడ్ యార్కర్లతో వైశాఖ్ అదరగొట్టాడు. బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. హిట్టింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. 15వ ఓవర్లో కేవలం 5 పరుగులే ఇచ్చి మ్యాచ్ను పంజాబ్వైపు తిప్పాడు. తర్వాతి ఓవర్లో జాన్సెన్ 8 రన్స్ ఇచ్చాడు. 17వ ఓవర్లోనూ వైశాఖ్ విజయ్కుమార్ మ్యాజిక్ చేశాడు. అద్బుతమైన బంతులతో రూథర్ఫర్డ్ను ముప్పుతిప్పలు పెట్టాడు. మూడు వైడ్లు వేసినా మొత్తంగా ఐదు పరుగులే ఇచ్చాడు. దీంతో గుజరాజ్ తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయింది. మూడు ఓవర్లకే 56 పరుగులు చేయాల్సిన స్థితికి వచ్చింది. 19వ ఓవర్లో విజయ్ కుమార్ 18 పరుగులు ఇచ్చినా.. అప్పటికే అతడు చేయాల్సిన పనంతా చేసేశాడు. గుజరాత్ను అడ్డుకున్నాడు. మొత్తంగా పంజాబ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేజింగ్ లో ఎప్పుడు ఇరు జట్లకు స్లాగ్ ఓవర్లే కీలకం… ముఖ్యంగా చివరి నాలుగైదు ఓవర్లే మ్యాచ్ లో విజయాన్ని డిసైడ్ చేస్తాయి. ఇక్కడే విజయ్ కుమార్ అదరగొట్టి గుజరాత్ ను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు.
కీలకమైన 15, 17 ఓవర్లలో చెరో ఐదు పరుగులే ఇచ్చి పంజాబ్ వైపు మ్యాచ్ను మలుపుతిప్పి గెలుపులో కీలకపాత్ర పోషించాడు వైశాఖ్. వరుసగా వైడ్ యార్కర్లు వేస్తూ వావ్ అనిపించాడు. వికెట్ తీయకపోయినా మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చేశాడు. వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడని, అది అంత సులువు కాదని మ్యాచ్ తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. సరైన లైన్, లెంగ్త్ వేశాడని, అతడికి ఫుల్ క్రెడిట్ ఇస్తున్నానని చెప్పాడు.
ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ బౌలర్ వైశాఖ్ విజయ్కుమార్ అదరగొట్టడంతో ఆర్సీబీ జట్టును కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఈ బౌలర్ గత రెండు సీజన్లు ఆర్సీబీకే ఆడాడు. అయితే, ఆ జట్టు అతడిని రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ దక్కించుకోలేదు. దీంతో పంజాబ్ సొంతం చేసుకుంది. ఇలాంటి బౌలర్ను ఎలా వదులుకున్నారంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి తప్పిదాలు చేస్తుండడం వల్లే ఇంకా టైటిల్ దక్కలేదంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్లోనే ఆ జట్టును గెలిపించాడు. కెప్టెన్సీతో పాటు ఈ మ్యాచ్లో 42 బంతుల్లోనే 97 పరుగులతో దుమ్మురేపి అజేయంగా నిలిచాడు శ్రేయస్. సెంచరీ కోసం చూడకుండా చివర్లో ఎక్కువగా శశాంక్ శర్మకే స్ట్రైకింగ్ ఇవ్వడం ద్వారా జట్టు భారీస్కోరు చేయడంలో కెప్టెన్ అనిపించుకున్నాడు.