Home » Tag » Haryana
సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ నియమితులయ్యారు. రాజ్ భవన్లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నయాబ్ సింగ్ సైనీ ప్రస్తుతం బీజేపీ తరఫున కురుక్షేత్ర నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. అందువల్లే సీఎం ఖట్టార్ తన పదవికి రాజీనామా చేశారు. మొత్తం 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
వరకట్నం మీద ప్రచారం కల్పించడానికి.. ఓ బీజేపీ నేత చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఒక్క రూపాయి కట్నం తీసుకుని.. తన కొడుకు పెళ్లి చేశాడు ఓ బీజేపీ నేత. ఈ ఆదర్శ వివాహం హర్యానాలో జరిగింది.
టీమిండియా (Team India) సీనియర్ బ్యాటర్ (Senior Batter) చటేశ్వర పుజారా (Chateshwara Pooja) పరుగుల వరద పారిస్తున్నాడు. రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో దుమ్మురేపుతున్నాడు. సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా మరో సెంచరీతో సత్తాచాటాడు. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో 110 పరుగులు సాధించాడు.
హర్యానాలోని పంచకులలో మిట్స్ హెల్త్ కేర్ అనే ఒక ఫార్మా సంస్థ యజమాని అయిన ఎంకే భాటియా.. తన సంస్థలోని 12 మంది టాప్ పెర్ఫామర్స్కు దీపావళి కానుకగా కార్లను గిఫ్ట్ ఇచ్చాడు. ఆ సిబ్బందిని సెలబ్రిటీలుగా పేర్కొన్నారు.
మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీపై విరుచుకుపడ్డారు. మణిపూర్లో భారతమాతను హత్య చేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి గట్టి కౌంటర్ ఎదురైంది.
మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన సమయంలో మత ఘర్షణలు హర్యానా రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. నిప్పు లేనిదే పొగరాదంటారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తరహా విధ్వంసం తెరపైకి వస్తోంది. ఓట్లను పోలరైజ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా..?
దేశ రాజధాని ఢిల్లీతోపాటు హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో 24 గంటల్లో ఐదుగురు మరణించారు. రెండు రోజుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
సాప్ట్ వేర్ ఆఫీసుల్లో పని చేయడం అంటే బయటకు కనిపించినంత సాప్ట్ గా ఉండదు. ఇది అందులో పనిచేసే వారికి బాగా తెలుసు. ఎందుకంటే బయటకు కనిపించే వర్కింగ్ హవర్స్ ఒకటి, లోపల జరిగే పనిగంటలు మరొకటి ఉంటాయి. ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని కాసులు ఆశ చూపిస్తాయి కొన్ని కంపెనీలు. ఇలా కాకుండా ఇచ్చిన పని పూర్తి చేసేంత వరకూ లాగ్ ఆఫ్ చేయకూడదు అంటూ హెవీ టాస్క్ ఇచ్చి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి. లాక్ డౌన్ కారణంగా తమ పిల్లలు చేసే పనేంటో ఇంట్లోని వారు అందరూ కళ్లారా చూసి ఉంటారు. సాఫ్ట్ వేర్ అంటే ప్రోగ్రామింగ్ ల్యంగ్వేజ్ అంతకాకపోయినా వర్క్ ఫ్రం హోం కారణంగా పేరెంట్స్, రిలేటీవ్స్ కి కొంతో గొప్పో అర్థమయ్యే ఉంటుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా ఉద్యోగులు పని అయిపోయే వరకూ బయటకు వెళ్లకూడదు అని షరతులు పెడుతూ గేట్ కు తాళాలు వేయించింది ఒక కంపెనీ. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజకీయ నాయకుడు కావడం ఈజీనేమో.. కానీ నాయకుడు అవడం మాత్రం కష్టం ! డబ్బులు విసిరేసో.. తాతలు, తండ్రి పేరు చెప్పుకునో లీడర్ అవుదామంటే కుదరదిక్కడ ! జనంలో ఉండాలి.. జనంతో ఉండాలి.. జనంలా ఉండాలి.. కష్టం తెలుసుకోవాలని.. ఓదార్పు ఇవ్వాలి.. భరోసా నింపాలి. అప్పుడే జనం మనసు గెలిచేది.. నిజమైన నాయకుడు అయ్యేది !