Home » Tag » India vs bangladesh
టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తో సిరీస్ లో దుమ్మురేపుతాడనుకుంటే తొలి టెస్టులో డకౌటయ్యాడు. ఈ డకౌట్ తో ఒక చెత్త రికార్డును కూడా గిల్ మూటగట్టుకున్నాడు.
వరల్డ్ క్రికెట్ లో సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ గురించి ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. బౌలర్ ఎవరైనా దాదాగిరీ చేసేవాడు... ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ లో ఫ్రంట్ ఫూట్ కు వచ్చి దాదా కొట్టిన సిక్సర్ చూస్తే ఆ కిక్కే వేరు.. తన క్రికెట్ కెరీర్ లో గంగూలీ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు.
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడబడి నిలబడింది. తొలి సెషన్ లో మొదటి గంట బంగ్లా బౌలర్లు పై చేయి సాధించగా... జైశ్వాల్ , పంత్ ఆదుకున్నారు. రెండో సెషన్ లో వరుస వికెట్లు చేజార్చుకున్నప్పటకీ రవిచంద్రన్ అశ్విన్ కౌంటర్ ఎటాక్ తో బంగ్లాకు దిమ్మతిరిగింది.
భారత్ , బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో పేస్ పిచ్ పై భారత బ్యాటర్లు తడబడ్డారు. టాపార్టర్ విఫలమవడంతో రిషబ్ పంత్, జైశ్వాల్ జట్టును ఆదుకున్నారు. వీరి పార్టనర్ షిప్ బలపడడంతో బంగ్లా ఆటగాళ్ళు స్లెడ్జింగ్ కు దిగారు.
భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టుకు ముందు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెన్నై వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ లో స్పిన్నర్లు కూడా కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముంగిట భారత క్రికెటర్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. జడ్డూ మరో 6 వికెట్లు తీస్తే ఈ ఘనత సాధిస్తాడు.
భారత్,బంగ్లాదేశ్ తొలి టెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం నుంచి జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉన్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 9 నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లోకి అడుగుపెడుతున్నాడు.
సాధారణంగా బ్యాటర్లు సిక్సర్లు కొడితే స్టేడియంలో ఉన్న డ్రెస్సింగ్ రూమ్ , వీఐపీ గ్యాలరీలో ఉండే అద్దాలు బద్దలవడం చూస్తూనే ఉంటాం... కానీ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భారీ షాట్లతో అద్దం కాదు ఏకంగా గోడనే బ్రేక్ చేశాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ మొదలుకాబోతోంది. దాదాపు ఏడు వారాల విరామం తర్వాత గ్రౌండ్ లో అడుగుపెట్టిన టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా ఉంది. సీనియర్ క్రికెటర్లందరూ ఈ సిరీస్ లో ఆడుతుండడంతో అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.
దాదాపు 7 వారాల సుధీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది.