Home » Tag » test match
ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో దిగలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించాడు. దీంతో రోహిత్ ఎక్కడా అంటూ అందరూ చర్చించుకున్నారు.
పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పాడు. తుది జట్టు ఎంపిక ఇంకా ఖరారు కాలేదని, మ్యాచ్ ప్రారంభానికి ముందు చివరగా పిచ్ ఔట్ లుక్ చూసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగలి ఉండగానే 3-1తో కైవసం చేసుకున్న భారత్.. 64.58 విజయాల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది.
టీమిండియాలోకి తిరిగి రావాలంటే కచ్చితంగా రంజీల్లో ఆడాలన్న బోర్డు ఆదేశాలను ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు ధిక్కరించారు. బీసీసీఐ ఆదేశాలను భేఖాతర్ చేసి వీరిద్దరూ రంజీల్లో ఆడకుండా తప్పించుకున్నారు.
వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్ట్లు ఆడని కోహ్లీ.. మూడు, నాలుగో టెస్ట్కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం. చివరి మూడు టెస్ట్ల్లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది.
విశాఖలోని వీడీసీఏ స్టేడియంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) శుక్రవారం సమావేశమైంది. మ్యాచ్ సన్నాహక ఏర్పాట్లపై చర్చించింది. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సభ్యులు వెల్లడించారు.
వార్నర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్లు సైతం వార్నర్కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. తన చివరి టెస్టు ఇన్నింగ్స్ను వార్నర్ హాఫ్ సెంచరీతో ముగించాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు.
కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 54.16 విజయాల శాతంతో సౌతాఫ్రికాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన టీమిండియా 2 గెలిచి ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది.
మరో రెండు రోజుల్లో తన కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. వన్డేల నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు చెప్పాడు.