HARISH RAO: చిదంబరం వల్లే తెలంగాణలో బలిదానాలు.. ఆయనకు చరిత్ర తెలియదు: మంత్రి హరీశ్ రావు

పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పటి నెహ్రూ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు. చిదంబరమే చరిత్ర తెలియకుండా వ‌క్ర భాష్యాలు చెబుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 04:57 PMLast Updated on: Nov 16, 2023 | 4:57 PM

Harish Rao Fires On Congress Leader P Chidambaram

HARISH RAO: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి హరీష్ రావు. గురువారం చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా స్పందించారు. “కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా ఉంది. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం.. దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పటి నెహ్రూ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది?

Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ.. కీలక హామీలివే..!

చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు. చిదంబరమే చరిత్ర తెలియకుండా వ‌క్ర భాష్యాలు చెబుతున్నారు. అప్ప‌ట్లో మద్రాసు రాష్ట్రం ఉండేద‌ని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదం. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేద‌నే విషయాన్ని ఆయ‌న మరిచిపోతున్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిది. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు.

దమ్ముంటే చిదంబరం తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్. సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మోడల్‌గా నిలిపింది కేసీఆర్. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్‌వైపే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని దీవించబోతున్నారు” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.