ED : వాషింగ్ మెషిన్ లో కోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే షాక్..?

హైదరాబాద్ లో కాప్రికార్న్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీలో ఈడీ దాడులు చేసింది. సోదాల్లో ఓ వాషింగ్ మెషిన్లో నగదు లభ్యం కావడం ఈడీ అధికారులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2024 | 12:32 PMLast Updated on: Mar 27, 2024 | 12:32 PM

Bundles Of Notes In The Washing Machine Shock If You Know So Much

హైదరాబాద్ లో కాప్రికార్న్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీలో ఈడీ దాడులు చేసింది. సోదాల్లో ఓ వాషింగ్ మెషిన్లో నగదు లభ్యం కావడం ఈడీ అధికారులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఈ మొత్తం దాదాపు రూ.2.54 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘన కింద కేసు నమోదు చేసిన అధికారులు.. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక విషయంలోకి వెళితే..
దేశంలో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు కంపెనీలపై దాడులు చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుంది. మంగళవారం క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్ డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామితో పాటు అనుబంధ సంస్థలు, లక్ష్మీటన్ మారిటైమ్, హిందుస్థాన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

క్యాప్రీకార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ (ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామితో పాటు దాని అనుబంధ సంస్థలైన M/s లక్ష్మీటన్ మారిటైమ్, M/s హిందుస్థాన్ ఇంటర్నేషనల్, M/s రాజనందిని మెటల్స్ లిమిటెడ్, M/s స్థావర్ట్ అల్లాయ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, M/s భాగ్యనగర్ లిమిటెడ్, M/s వినాయక్ స్టీల్స్ లిమిటెడ్, M/s వశిష్ట కన్స్ట్రక్షన్స్ Pvt Lidలతోపాటు ఈ సంస్థల భాగస్వాములు సందీప్ గార్గ్, వినోద్ కేడియా నివాసాల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది.

భారతదేశం వెలుపల పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్య లావాదేవీల్లో ఈ సంస్థల ప్రమేయం ఉందని.. ఈ సంస్థలు బోగస్ సరకు రవాణా, దిగుమతుల పేరిట షెల్ కంపెనీల సాయంతో సింగపూర్ కు చెందిన రెండు సంస్థలతో రూ. 1800 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీకి సమాచారం అందింది. అందటంతో ఢిల్లీతో సహా.. హైదరాబాద్, ముంబై, కోల్ కతా, కురుక్షేత్రం వంటి పలు నగరాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరరేట్ ఆకస్మిక దాడులు జరిపింది. ఈడీ తణీకిల్లో.. రూ.2.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు విలువైన పత్రాలు, డిజిటల్ పరికరాలను ఈడీ సీజ్ చేసింది. ఈ లావాదేవీలతో అనుబంధ సంస్థలతో ప్రమేయం ఉన్న 47 బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ దాడుల్లో కొంతమొత్తం వాషింగ్‌ మెషిన్‌లో దొరికినట్లు ఈడీ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో వెల్లడించింది.