మేనమామ ఆర్డర్, రంగంలోకి సాయి ధరమ్ తేజ్…?

తెలంగాణాలో జనసేన పార్టీని ఇప్పుడు బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 27, 2024 | 12:08 PMLast Updated on: Aug 27, 2024 | 12:08 PM

Pawan Kalyan Plans To Strengthen Janasena In Telangana

తెలంగాణాలో జనసేన పార్టీని ఇప్పుడు బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇందుకోసం పక్కా ప్లాన్ తో ఆయన దిగే అవకాశం అయితే కనపడుతోంది. మరి తెలంగాణా అధ్యక్ష బాధ్యతలను ఎవరికి ఇస్తారు ఏంటీ అనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది. తన సోదరుడు నాగబాబు లేదంటే మేనల్లుడు సాయి ధరం తేజ్ కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాగబాబు కంటే సాయి ధరం తేజ్ వైపే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారని ఇందుకోసం రెడీ అవ్వాలని, కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని కూడా చెప్పారని టాక్ వస్తోంది.

మేనమామ ఆదేశించడంతో సాయి ధరం తేజ్ రెడీ అవుతున్నట్టుగా కనపడుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఆయన సోషల్ మీడియాలో తొలిసారి రాజకీయ తరహా పోస్ట్ కి ఒక కామెంట్ చేయడం అది వైరల్ కావడం జరిగాయి. వైసీపీని అభిమానించే వ్యక్తికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సాయి ధరం తేజ్. ఈ మెగా హీరోని ట్యాగ్ చేస్తూ… వైసీపీని అభిమానించే డాక్టర్ చింతా ప్రతాప్ రెడ్డి ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ, అన్నా క్యాంటిన్ లో ప్లేట్లు కడగవచ్చుగా సేఫ్ హ్యాండ్స్ తో ఆయన పోస్ట్ చేసారు.

ఆ తర్వాత… అది తన బయో అని… మిస్ కావోద్దని, దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ లో సేఫ్ హ్యాండ్స్ మిస్ అయ్యాయని ప్రతాప్ రెడ్డి మరో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కి రెండు గంటలు ఆలస్యంగా రియాక్ట్ అయిన సాయి ధరం తేజ్… ఓకే ఓకే… ఎగ్ పఫ్ బిల్ ఎక్కువగా ఉండటంలో ఆశ్చర్యం ఏం లేదు సర్. మీరు బాగా తిన్నారని నేను అనుకుంటున్నాను అంటూ సాయి ధరం తేజ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఏపీలో గత ప్రభుత్వంలో మూడున్నర కోట్ల విలువ చేసే ఎగ్ పఫ్ లు తిన్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో సాయి ధరం తేజ్ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతున్నారని, త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.